ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేసేది నేనే.. పరిటాల శ్రీరామ్

by Jakkula Mamatha |   ( Updated:2024-03-05 14:45:01.0  )
ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేసేది నేనే.. పరిటాల శ్రీరామ్
X

దిశ ప్రతినిధి, అనంతపురం:వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీచేసేది నేనే.. ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేసేది కూడా నేనే'నని నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. మధ్యలో ఎవరో మాట్లాడే గాలి మాటలు అసలు పట్టించుకోవద్దు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. బాబు సూపర్ -6 కార్యక్రమంలో భాగంగా ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా గ్రామానికి వచ్చిన శ్రీరామ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డప్పులు వాయిస్తూ బాణా సంచా కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ, గజమాలతో శ్రీరామ్ కు స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ్ ఇంటింటికీ వెళ్తూ సూపర్-6 పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీరామ్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని.. అలాగే గ్రామానికి డబుల్ రోడ్డు వేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరికొన్ని సమస్యలు కూడా శ్రీరామ్ దృష్టికి తెచ్చారు. దీనిపై శ్రీరామ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కాగానే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మవరంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని.. కచ్చితంగా ఈ సారి టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు.


Read More..

BREAKING: బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉంది: జయహో బీసీ గర్జనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed